ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులకు శుభవార్త అందింది. మద్యం దుకాణాల పని గంటలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం అమ్మకాలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మద్యం దుకాణాలను తెరిచే సమయాన్ని రాత్రి 10 గంటల పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 17, సోమవారం నాడు ఏపీ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరవనున్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ దుకాణాలు కూడా రాత్రి 10 వరకు నిర్వహించనున్నారు. అలాగే విక్రయ ఖాతాల నిర్వహణకు రాత్రి 10 గంటల తర్వాత మరో గంట పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF