టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకున్న శ్రీరామ్కు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. వైద్యుల సూచనల మేరకు మెడిసిన్ వాడుతున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా తనను కలిసిన శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లయితే, వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని పరిటాల శ్రీరామ్ కోరారు. శ్రీరామ్ విషయం తెలిసిన పరిటాల కుటుంబ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ