ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గుంటూరు లోని రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడుకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. అలాగే రమేష్ ఆస్పత్రి వైద్యులు అచ్చెన్నాయుడుకు కరోనా చికిత్స అందిస్తునట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu