ఏపీలో 21 వేలు దాటిన కరోనా కేసులు, 252 కి చేరిన మరణాలు

Andhra Pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Corona Updates in AP, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, Coronavirus Live Updates, COVID-19, Total Corona Cases In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 1178 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 7, మంగళవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 21197 కి చేరింది. వీటిలో 1155 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 22, విదేశాల నుంచి వచ్చిన వారు ఒక్కరు ఉన్నారు. గత 24 గంటల్లో 16,238 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. మొత్తం కేసుల్లో 18520 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 2677 మంది ఉన్నారు.

మరోవైపు కరోనా వలన కర్నూల్ లో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, ప్రకాశంలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 252 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికే 9745 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8952 మంది ఆసుపత్రుల్లో, 2248 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 11200 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 12 =