ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9597 కరోనా పాజిటివ్ కేసులు, 93 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 9597 కేసులతో కలిపి ఆగస్టు 12, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 254146 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) రికార్డ్ స్థాయిలో 57148 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో కరోనా వలన గుంటూరు జిల్లాలో పదమూడు మంది, ప్రకాశంలో పదకొండు మంది, చిత్తూరులో పదిమంది, నెల్లూరులో పదిమంది, శ్రీకాకుళంలో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఏడుగురు, కడపలో ఏడుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, కర్నూల్ లో నలుగురు, కృష్ణాలో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 2296 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 161425 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 6676 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 90425 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu