ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఎక్కడికక్కడ కొత్త జిల్లాగా తమ ప్రాంతాన్ని ప్రకటించాల్సిందిగా అన్ని జిల్లాల నుంచీ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. అనంతపురం జిల్లాలోని హిందూపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వారితోపాటుగా సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం జిల్లా కోసం ఉద్యమం చేయటానికి నిశ్చయించుకున్నారు. దీనికోసం ఆయన రేపు హిందూపురంలో మౌన దీక్ష చేపట్టనున్నారు.
అయితే, దానికి ముందుగా హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించి.. ఆ తర్వాత దీక్ష చేపట్టనున్నారు బాలకృష్ణ. శుక్రవారం ఉదయం హిందూపురం పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరగనుందని జిల్లా టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌన దీక్ష చేపట్టనున్నారు. మరోవైపు ఉద్యమ కార్యాచరణపై శుక్రవారం సాయంత్రం అఖిలపక్ష నేతలతో బాలకృష్ణ చర్చించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ