ఏపీలో టీడీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత బుధవారం నాడు శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె ఏపీ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ కు తన రాజీనామా లేఖను పంపించారు. రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా టీడీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా పోతుల సునీత వెల్లడించారు. టీడీపీ ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతోందని ఆమె విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు మేలు జరగడమే లక్ష్యంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటున్న నేపథ్యంలోనే తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు పోతుల సునీత పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu