ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 91,231 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 3620 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో జూన్ 29, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,85,716 కు చేరింది. కరోనా వలన రాష్ట్రంలో మరో 41 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 12671 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 5757 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 18,32,971 కు పెరిగింది. ప్రస్తుతం 40,074 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(3620):
- తూర్పుగోదావరి – 617
- పశ్చిమగోదావరి – 565
- చిత్తూరు – 451
- ప్రకాశం – 386
- కృష్ణా – 332
- గుంటూరు – 299
- నెల్లూరు – 210
- అనంతపూర్ – 190
- విశాఖపట్నం – 176
- కడప – 137
- శ్రీకాకుళం – 118
- విజయనగరం – 95
- కర్నూల్ – 44
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ