గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతకు గురైనవారికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్ 27న ఇప్పటం బాధితులకు పవన్ కళ్యాణ్ రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ముందుగా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరిట పలు ఇళ్లు, ప్రహరీలను కూల్చివేసిన విషయం తెలిసిందే. గత మార్చి 14న ఇప్పటం శివారులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, సభా స్థలిని ఇచ్చారనే నేపథ్యంలోనే తమ ఇళ్లను కూల్చి వేశారని కొందరు గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటన జరిగిన మరునాడే పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఇళ్లు దెబ్బతిన్నా ధైర్యం కోల్పోని ఇప్పటం గ్రామస్తులకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించారు. అనంతరం వారికీ నైతిక మద్దతుతోపాటు ఆర్థికంగా కూడా అండగా నిలబడాలనే ఉద్దేశంతో లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ నెల 27న ఈ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతకు గురైనవారికి అందజేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE