ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులుపై ఆసక్తి కనబరుస్తూ ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందం ముందుకొచ్చింది. సెప్టెంబర్ 26, గురువారం నాడు ఉదయం తాడేపల్లిలోని నివాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందం కలుసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్న విషయాన్ని వారు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు రంగాల్లో పెట్టుబడులపై ముఖ్యమంత్రి జగన్ వారితో చర్చించారు. రెండు రోజుల పాటు పర్యటనలో భాగంగా రాష్టానికి వచ్చిన 13 మంది ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందానికి ముందుగా పెట్టుబడులకు అనుకూల పరిస్థితులుపై రాష్ట్ర మంత్రులు, అధికారులు అవగాహన కల్పించారు. ఫుడ్ ప్రాసెసింగ్, డైరీ, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ గ్రిడ్ ఆటోమేషన్, తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ బృంద సభ్యులు ఆసక్తి కనబరిచారు.
[subscribe]