ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ తెలుగుదేశం-జనసేన కూటమి స్పీడ్ పెంచేసింది. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ ఇచ్చి.. తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించేసింది. ఈసారి జనసేన పార్టీ 24 అసెంబ్లీ స్థానాలు.. 3 లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేస్తోంది. మిగిలిన స్థానాల్లో తెలుగు దేశం పార్టీ బరిలోకి దిగుతోంది. ఈక్రమంలో తమ పార్టీ పోటీ చేస్తున్న 24 స్థానాల్లో 5 స్థానాలకు జనసేనాని పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 94 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మొత్తానికి ఇప్పటి వరకు కూటమి 99 మంది గెలుపు గుర్రాలను కదనరంగంలోకి దింపేసింది.
అయితే టీడీపీ-జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల్లో ఎంత మంది గెలుపొందుతారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై ఇండిపెండెంట్ ఏజెన్సీ ఇండియా ఇంటెన్షన్స్ సర్వే చేసి సంచలన విషయాలను బయటపెట్టింది. వైసీపీ, టీడీపీ-జనసేన, ఇతర ఓటర్ల నుంచి తమ అభిప్రాయాలను సేకరించింది. ఇండియా ఇంటెన్షన్స్ నివేదిక ప్రకారం టీడీపీ-జనసేన ప్రకటించిన 99 స్థానాల్లో 37 స్థానాలను మత్రమే కూటమి గెలుచుకుంటుందని వైసీపీ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.
అదే సమయంలో ఆ 99 సీట్లలో 78 స్థానాల్లో ఖచ్చితంగా కూటమి గెలుపొందుతుందని టీడీపీ-జనసేన ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక 99 స్థానాల్లో 61 సీట్లలో కూటమి విజయం సాధిస్తుందని ఇతరులు చెబుతున్నారు. సగటున 99 స్థానాల్లో 57 సీట్లను జనసేన-టీడీపీ కూటమి గెలచుకుంటుందని ఇతర సర్వేలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE