ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఫిబ్రవరి 26, బుధవారం నాడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యామ్ప్రసాద్రెడ్డి, నల్లమలుపు బుజ్జి, జెమిని కిరణ్ తదితరులు సీఎం వైఎస్ జగన్ ను కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం నిర్మాత దగ్గుబాటి సురేష్ మాట్లాడుతూ, ఆరు సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో హుద్హుద్ తుపాను విధ్వంసం సృష్టించిన సమయంలో ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని ఆదుకోవడం కోసం తెలుగు సినీ పరిశ్రమ టెలీథాన్ పేరుతో కార్యక్రమం నిర్వహించిదని చెప్పారు.
ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన రూ.15 కోట్ల నిధులుతో విశాఖలో బాధితులకు ఇళ్లు కట్టించినట్లు తెలిపారు. విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంత సమీపంలో 320 సింగిల్ బెడ్రూం ఇళ్లును నిర్మించామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ ఇళ్లను ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ను కోరామని అన్నారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే ఆ ఇళ్లను ప్రారంభించి బాధితులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ను కలిసిన వారిలో నిర్మాతలతో పాటుగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు.
[subscribe]