సీఎం వైఎస్ జగన్‌ ను కలిసిన త్రిదండి చినజీయర్‌ స్వామి

AP CM YS Jagan, Chinna Jeeyar, Chinna Jeeyar invites Jagan Mohan Reddy, Chinna Jeeyar invites Jagan Mohan Reddy to Ramanujacharya’s birth anniversary fete, Chinna Jeeyar meets CM Jagan, Chinna Jeeyar Swamy, Chinna Jeeyar Swamy Meets AP CM, Chinna Jeeyar Swamy Meets AP CM YS Jagan, Mango News, My Home Rameshwar Rao, Ramanujacharya’s birth anniversary fete, Tridandi Chinna Jeeyar Swamy, Tridandi Chinna Jeeyar Swamy Meets AP CM YS Jagan, Tridandi Chinna Jeeyar Swamy Meets AP CM YS Jagan Today

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని శనివారం ఉదయం త్రిదండి చినజీయర్‌ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2, 2022 నుంచి ఫిబ్రవరి 14, 2022 వరకు నిర్వహించే భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకలకు హాజరు కావాలని సీఎం వైఎస్ జగన్ ను చినజీయర్‌ స్వామి ఆహ్వానించి, ఆహ్వాన పత్రిక అందించారు. సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా 216 అడుగుల ఎత్తయిన రామానుజుల పంచలోహ (సమతామూర్తి) విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

ఈ మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా వరుసగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులను చినజీయర్‌ స్వామి స్వయంగా ఆహ్వానిస్తున్నారు. మరోవైపు ముందుగా సీఎం నివాసానికి చేరుకున్న చినజీయర్‌ స్వామి వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు తీసుకున్నారు. సీఎంను కలిసిన వారిలో చినజీయర్‌ స్వామీజీతో పాటుగా, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మై హోమ్ గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 3 =