తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా డిసెంబరు 27, మంగళవారం నాడు బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబరు 27న ఉదయం 6 నుండి 12 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కారణంగా డిసెంబరు 26న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని, శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఇక నూతన ఆంగ్ల సంవత్సరాది 2023, జనవరి 1 మరియు జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆన్ లైన్ కోటాను ఈ రోజు (డిసెంబరు 24, శనివారం) ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. మరోవైపు 2022, డిసెంబర్ 23న మొత్తం 62,055 యాత్రికులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారని తెలిపారు. 23,044 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ కానుకలు రూ.3.99 కోట్లు వచ్చినట్టు తెలిపారు. అలాగే స్వామివారి దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE