దేశంలో గత 24 గంటల్లో మొత్తం 1,36,315 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 201 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.15 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,76,879 కు చేరుకుంది. కరోనా వలన మరో మరణం (కేరళలో రికాంసైల్డ్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,691కి పెరిగింది. అలాగే 183 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,42,791కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
కాగా ప్రస్తుతం దేశంలో 3,397 (0.01%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు కొంత ఎక్కువుగా నమోదు అయ్యాయి. అయితే ఏ రాష్ట్రంలో కూడా 100 పైన కరోనా కేసులు నమోదవలేదు.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలివే (డిసెంబర్ 23 (8am)–డిసెంబర్ 24 (8am)):
- కేరళ – 56
- మహారాష్ట్ర – 23
- రాజస్థాన్ – 23
- కర్ణాటక – 17
- ఢిల్లీ – 13.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE