ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు మరోక కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రాష్ట్ర ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్లో కలపాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నిర్ణయంపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. టీటీడీ పరిపాలన భవనం ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఉద్యోగులంతా భౌతికదూరం పాటిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. టీటీడీ పాలకమండలి నిర్ణయంతో తమ ప్రయోజనాలు కోల్పోతామని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్లో కలిపే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు పాలక మండలిని డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu