శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు శుభవార్త వినిపించింది. తిరుమలలో కొలువైన ఆ ఏడుకొండలవాడి ప్రత్యేక దర్శనం కోసం భక్తులకు ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. రేపు (శనివారం) ఉదయం 9 గంటలకు ఈ టికెట్ల కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. భక్తుల సౌకర్యార్థం రేపు ఉదయం జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రూ. 300 దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు అధికారులు. జులై, ఆగస్టు రెండు నెలలకు గానూ 25 వేల టిక్కెట్లు విడుదల చేయనున్నామని, భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు టిటిడి అధికారులు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ