తిరుపతి విచ్చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Mango News, Tirumala Tirupati, Tirumala Tirupati Devasthanam, Tirupati, Venkaiah Naidu, Venkaiah Naidu Came To Tirupati on Two Day Visit, Venkaiah Naidu Tirupati Visit, Vice President, Vice President Venkaiah Naidu Tirumala tour, Vice Prez to visit Tirupati, Vice-President Venkaiah Naidu Came To Tirupati, Vice-President Venkaiah Naidu Came To Tirupati on Two Day Visit

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసారు. తొలుత రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వెంకయ్య నాయుడుకు మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తన మనవరాలి పెళ్లి కోసం వెంకయ్య నాయుడు తిరుపతి చేరుకున్నారు. తిరుచానూరు యోగిమల్లవరం లోని ఒక కళ్యాణమండపంలో ఈ వివాహ కార్యక్రమం జరుగనుంది. ఈమేరకు వెంకయ్య నాయుడు కుటుంబ సభ్యులు తిరుపతి చేరుకున్నారు.

వివాహానికి ముందు నిర్వహించే పలు పూజ కార్యక్రమాలు ఈ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు. అనంతరం, ఈ రోజు రాత్రికి తిరుమల చేరుకొని కళ్యాణ వేడుక జరుపుకోనున్నారు. ఈ రోజు సాయంత్రం తిరుచానూరు కళ్యాణ మండపం నుంచి తిరుమలలోని కళ్యాణ మండపానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, వారి కుటుంబ సభ్యులు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో.. తిరుచానూరు కళ్యాణ మండపం వద్ద పోలీసులు, కేంద్ర బలగాలు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.  గురువారం ఉదయం ఉపరాష్ట్రపతి కుటుంబం శ్రీవారిని దర్శించుకోనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 11 =