మచిలీపట్నంలో కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో కృష్ణా జెడ్పీ చైర్మన్గా 27 ఏళ్లుగా పని చేసిన దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఈరోజు ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వర్గీయ పిన్నమనేని సేవలను స్మరించుకున్నారు. ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేసిన పిన్నమనేని లాంటి నాయకులు నేటి తరానికి ఆదర్శమని వెంకయ్య పేర్కొన్నారు. అనంతరం విజయవాడ సమీపంలోని ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
విశాఖపట్నం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న వెంకయ్య నాయుడు విశాఖపట్నం బయలుదేరి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం కోసం వెంకయ్య నాయుడు ఆదివారం సాయంత్రం కృష్ణా జిల్లాకు వచ్చారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మొదట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వాగతం పలికారు. ఇంకా గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ (రిజిస్ట్రేషన్) రజత్ భార్గవ, కృష్ణా కలెక్టర్ పి. రంజిత్ బాషా, ఎస్పీ సిద్దార్థ కౌశల్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి, బిజెపి నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాస్ తదితరులు శ్రీ నాయుడుకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ