తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏప్రిల్ 27న హైదరాబాద్లో నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు ఏప్రిల్ 27న మాదాపూర్లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసిసి)లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు మరియు ప్రతినిధులందరూ హాజరు కావాలని ఆయన ఆదేశించారు. ఏప్రిల్ 27 ఉదయం 10 గంటల నుండి వేడుకలు ప్రారంభమవనున్నాయి. వేడుకల రోజున ప్రతినిధుల నమోదు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆహ్వానితుల నమోదు ప్రక్రియ 11 గంటల వరకు జరుగనుంది. వేదిక వద్ద ఉదయం 11.05 గంటలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఎగురవేస్తారు.
కార్యక్రమంలో భాగంగా మొదటగా సీఎం కేసీఆర్ స్వాగతోపన్యాసం చేయనున్నారు. అనంతరం కొన్ని కీలక అంశాలపై చర్చించి వాటిపై తీర్మానాలు చేయనున్నారు. ఆ తీర్మానాలను ఆమోదించైనా తర్వాత వేడుకలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకల్లో మంత్రులు, రాజ్యసభ, లోక్సభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొననున్నారు. పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ ఉదయం 10 గంటలకల్లా సభా వేదిక వద్దకు చేరుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ