విజయవాడ నగరంలోని కనకదుర్గ ఫ్లైఓవర్ అక్టోబర్ 16, శుక్రవారం నాడు ప్రారంభమైంది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ గా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, ఫ్లైఓవర్ ను లాంఛనంగా ప్రారంభించారు. 2.6 కి.మీల పొడవుతో రూ.502 కోట్ల వ్యయంతో అబ్బురపరిచేలా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం కోసం విజయవాడ ప్రజలు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజుతో నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మరోవైపు రూ.8,007 కోట్ల రూపాయలతో ఇప్పటికే పూర్తి అయిన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్ జగన్లు సంయుక్తంగా జాతికి అంకితం ఇచ్చారు. అదేవిధంగా రూ.7584 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే మరో 16 ప్రాజెక్టులకు కూడా వారు ఈ రోజు భూమిపూజ నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu