ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (జూలై 26, మంగళవారం) డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పి.గన్నవరం నియోజకవర్గం గంటిపెదపూడి పంచాయతీ పరిధిలోని బూరుగులంక, పెదపూడిలంక, అరిగెలవారి పేట, ఊడిమూడి లంక గ్రామాలు, అలాగే రాజోలు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో సీఎం వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులతో మాట్లాడనున్నారు.
ఈ గ్రామాల్లో వర్షాలు, వరదల వలన ఏర్పడ్డ పంట, ఇతర నష్టాన్ని సీఎం పరిశీలించనున్నారు. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ, కోనసీమ కలెక్టర్ హిమాన్షు శుక్లా, ప్రభుత్వ విప్ చిల్లా జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పలువురు అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY