చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ నేత గుదిబండ గోవ‌ర్ధ‌న్ రెడ్డి

YSRCP Leader Gudibanda Govardhan Reddy Joins TDP in the Presence of Chandrababu Naidu, Gudibanda Govardhan Reddy Joins TDP in the Presence of Chandrababu Naidu, YSRCP Leader Gudibanda Govardhan Reddy Joins TDP, YSRCP Leader Gudibanda Govardhan Reddy, Nara Chandrababu Naidu, Chandrababu Naidu, Gudibanda Govardhan Reddy, YSRCP Leader Joins TDP in the Presence of Chandrababu Naidu, Telugu Desam Party, YSRCP Leader Gudibanda Govardhan Reddy News, YSRCP Leader Gudibanda Govardhan Reddy Latest News And Updates, YSRCP Leader Gudibanda Govardhan Reddy Live Updates, Mango News, Mango News Teluguy

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో శుక్రవారం నాడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైఎస్సార్సీపీ నేత గుదిబండ గోవ‌ర్ధ‌న్ రెడ్డి, ఆయన అనుచరులు టీడీపీ పార్టీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుదిబండ గోవ‌ర్ధ‌న్ రెడ్డికి చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే గోవ‌ర్ధ‌న్ రెడ్డి అనుచరులకు, కొల్లిపర నాయకులకు కూడా చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే వెంకట‌రెడ్డి సోద‌రుడి కుమారుడు గోవ‌ర్ధ‌న్ రెడ్డి. గత 10 సంవత్సరాలుగా వైఎస్సార్సీపీలో కొన‌సాగిన ఆయ‌న, తాజాగా పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ, గుదిబండ గోవ‌ర్ధ‌న్ రెడ్డిని, ఆయన అనుచరులను పార్టీలోకి స్వాగతిస్తున్నామని చెప్పారు. మూడు రాజధానుల పేరుపెట్టి, దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చారన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని అన్నారు. నిన్న ఒక్కరోజే జరిగిన ఐదు సంఘటనలు చూసి తనకు ఎంతో బాధేసిందన్నారు. చాలా విషయాల్లో ప్రజల్లో బాధ ఉందని, మళ్ళీ ప్ర‌జ‌లంద‌రూ టీడీపీతో క‌లిసి రావాల‌ని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + thirteen =