బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు ఉపశమనం కల్పిస్తూ గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కవిత శుక్రవారం లేఖ రాశారు.
“2002 బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల విడుదలకు సంబంధించి గౌరవనీయులైన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ)కు నా లేఖ. ఈ దారుణమైన నేరం జరిగినప్పుడు బిల్కిస్ వయస్సు 21 సంవత్సరాలు మరియు 5 నెలల గర్భిణి. మన చట్టాలపై దేశానికి ఉన్న విశ్వాసాన్ని కాపాడాలని భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని వేడుకుంటున్నాను” అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేస్తూ, లేఖను జతచేశారు. అలాగే మానవత్వంతో ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ద్వారా బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.
My letter to Hon’ble #CJI regarding the release of the 11 convicts in the #BilkisBanoCase of 2002. Bilkis was 21 years old & 5 months pregnant at the time when this heinous crime took place.
I implore the Hon’ble Supreme Court of India to save the nation’s faith in our laws. pic.twitter.com/jT6mbEYuQR— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 19, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY