ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ గా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. శాసనమండలిలో జకియా ఖానమ్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా కుర్చీ వద్దకు తీసుకొచ్చి, బాధ్యతలు స్వీకరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ సందర్భంగా జకియా ఖానమ్ కు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు కూడా అభినందనలు తెలియజేశారు.
ముందుగా శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా జకియా ఖానమ్ గురువారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఈ పదవి ఖాళీ అయ్యింది. దీంతో వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటికి చెందిన ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కు మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారు. ఇక ఈ పదవికి జకియా ఖానమ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ క్రమంలోనే శుక్రవారం మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా జకియా ఖానమ్ బాధ్యతలు చేపట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ