తెలంగాణలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన 12 ఎమ్మెల్సీ స్థానాల్లో నవంబర్ 26, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో మొత్తం 12 స్థానాల్లో 6 చోట్ల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక అవగా, మరో ఆరు స్థానాల్లో డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనున్నారు. నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత, మహబూబ్నగర్ లో కూచికుంట్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. వీరి ఎన్నికపై నేడే అధికారికంగా ప్రకటన వెలువడనుంది.
మరోవైపు ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానం, కరీంనగర్ జిల్లాల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 10వ తేదీన ఉదయం 08:00 నుంచి సాయంత్రం 04:00 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థులుగా ఖమ్మం నుంచి తాతామధు, మెదక్ నుంచి డాక్టర్ వంటేరి యాదవరెడ్డి, నల్గొండలో ఎంసీ కోటిరెడ్డి, ఆదిలాబాద్ లో దండె విఠల్, కరీంనగర్లో ఎల్.రమణ, భానుప్రసాద్ రావులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్, ఖమ్మంలో అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే ఈ స్థానాల్లో పలువురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ