రాష్ట్రంలోని కార్పొరేషన్స్ లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరు వైస్ చైర్పర్సన్లను నియమించుకునే విధంగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కార్పొరేషన్స్, మున్సిపాలిటీల్లో ఎన్నికల ఫలితాల అనంతరమే మేయర్, చైర్పర్సన్ ఎన్నికతో పాటుగా ఒక డిప్యూటీ మేయర్, ఒక వైస్ చైర్పర్సన్ ఎన్నిక కూడా చేపట్టారు. కాగా రెండో డిప్యూటీ మేయరు, వైస్ ఛైర్పర్సన్ల ఎన్నికకు తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
జూలై 30వ తేదీన రాష్ట్రంలోని ఏలూరు సహా 12 కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ ఎంపిక జరగనుంది. పరోక్ష పద్దతిలో జరిగే ఈ ఎన్నికకు 30వ తేదీన ప్రత్యేక సమావేశాలకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, కార్పోరేషన్ అధికారులకు ఎస్ఈసీ నీలం సాహ్ని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఎన్నికకు ఆయా చోట్ల ఎన్నికైన సభ్యులు(కార్పోరేటర్లు/ కౌన్సిలర్లు) మరియు ఎక్స్ అఫిషియో సభ్యులు తప్పకుండా హాజరు కావాలని పేర్కొన్నారు. అలాగే 26వ తేదీలోగా ఈ ఎన్నిక కోసం నిర్వహించే సమావేశ వివరాలను అందజేయాలని ఎస్ఈసీ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ