వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు వద్ద జరుగుతున్న పార్టీ ప్లీనరీలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ముగింపు ప్రసంగం చేశారు. శనివారం ప్లీనరీలో వైసీపీ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ను ఎన్నుకున్నారు. అనంతరం అశేషంగా హాజరైన ప్రజలను, కార్యకర్తలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. సీఎం జగన్ ప్రసంగం లోని కొన్ని ముఖ్యాంశాలు..
- పదమూడేళ్లుగా నాపై అభిమానం చూపిస్తున్న కార్యకర్తలు, నేతలు, అభిమానులకు నా సెల్యూట్.
- మన పార్టీని గట్టి పునాదిపై నిర్మించుకున్నాం, అలాగే మీ కష్టాల పునాదులపైనే మన ప్రభుత్వం ఏర్పడింది.
- ఒక్క ఎమ్మెల్యేతో మొదలైన ప్రయాణం ఇప్పుడు 151కి చేరింది, అలాగే ఒక్క ఎంపీతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు 22కి చేరింది.
- 2014లో మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న పార్టీకి చివరికి 2019లో అన్నే సీట్లు వచ్చాయి.
- 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచి తీరుతాం.
- ఎన్నికలప్పుడు మన మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో అవే అమలు చేస్తున్నాం.
- రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్నింటిలో ఎన్నో వినూత్న విప్లవాలు తీసుకొచ్చాం.
- ఒక్క విద్యారంగం లోనే తొమ్మిది కొత్త పథకాలు తీసుకొచ్చాం.
- 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని అర్జీ పెట్టుకుంటే ప్రజల మేలు కోసం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశాం.
- పాదర్శక పాలన కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం.
- కోనసీమకు రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ