గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. మొదటగా హేమ ఎలిమినేట్ అయ్యింది, తరువాత తమన్నా సింహాద్రి అనే ట్రాన్స్జెండర్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి రావడంతో మళ్ళీ ఇంటిలో 15 మంది సభ్యులు ఉన్నారు. జులై 31న ప్రసారమైన బిగ్ బాస్ 3 పదకొండో ఎపిసోడ్ లో శ్రీముఖి-అలీరేజా పిడకల టాస్క్ లో పాల్గొన్నారు, తమన్నా సింహాద్రి- అలీరేజా మధ్య సంభాషణ, వరుణ్ సందేశ్- శివజ్యోతి మధ్య వాదనతో ఎపిసోడ్ ఆసక్తికరంగా నడిచింది.
ఎపిసోడ్ 11 (జూలై31) హైలైట్స్: శ్రీముఖి-అలీరేజా పిడకల టాస్క్
- ఎపిసోడ్ మొదట్లో శ్రీముఖి-బాబాబాస్కర్ కొంతసేపు సరదాగా ఆట పట్టించుకున్నారు
- ఉదయం పదరా పదరా సాంగ్ బిగ్ బాస్ హౌజ్ లో ప్లే అవ్వగా తమన్నా సింహాద్రి డాన్స్ చేసారు
- జాఫర్, మహేష్ విట్టా నిద్ర లేవకపోవడంతో బిగ్ బాస్ హౌజ్ లో కుక్కలు మొరిగాయి
- తమన్నా సింహాద్రి అలీరేజాను బట్టలు వేసుకోకుండా ఎందుకు ఎక్సపోజ్ చేస్తున్నావని అడగగా, నాకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు లేదా అని అలీరేజా సరదాగా బిగ్ బాస్ కి కంప్లెయింట్ చేసాడు
- ప్లేటులో తినేసి కడగలేదంటూ, తమన్నాను అడగడంతో తాను బౌల్ లో తిన్నానని ప్రతిదానికి నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని తమన్నా వాదనకు దిగింది
- లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా మహేష్ కి దీపం ఆరిపోకుండా కాపాడాలని బిగ్ బాస్ కండిషన్ పెట్టారు, దీపం చుట్టూ అట్టముక్కలు పెడితే ఆరిపోకుండా ఉంటుందని శివజ్యోతి సలహా మేరకు మహేష్ ప్రయత్నం చేయగా, ఈలోపు బిగ్ బాస్ అలా చేయకూడదు అని చెప్పారు.
- బిగ్ బాస్ అలా చేయకూడదు అనడంతో, వరుణ్ సందేశ్, వితికా, పునర్నవి చప్పట్లు కొట్టడంతో శివజ్యోతి హార్ట్ అయింది, నేను అందరికోసం చెబుతుంటే నన్ను ఎందుకు హేళన చేస్తున్నారంటూ ఏడ్చేసింది, వరుణ్ తప్పు నాదే అంటూ సారీ చెప్పగా, ఎందుకు చప్పట్లు కొట్టారు నిన్ను ఎవరు సారీ అడిగారంటూ శివజ్యోతి మళ్ళీ ఏడ్చేసింది.
- లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా శ్రీముఖి-అలీరేజా లకు బిగ్ బాస్ పిడకల టాస్క్ ఇచ్చారు, ఇచ్చిన సమయంలో 100 పిడకలు కొట్టాలని బిగ్ బాస్ చెప్పగా వందకంటే ఎక్కువే కొట్టి ఇంటికి గ్యాస్ కొరత లేకుండా చేసుకున్నారు. శ్రీముఖి పిడకల టాస్క్ తరువాత అలీని కౌగిలించుకుంది.
- ఇక ఇంటిలో వాటర్ ప్రాబ్లెమ్ తీర్చడానికి వితికా కు చేపల తొట్టిలోంచి 50 కాయిన్స్ తీయాలని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వగా వితికా ఈజీగా టాస్క్ పూర్తి చేసింది
- ఇంటిలో ఉన్న 15 మంది సభ్యులలో చెత్త ప్రదర్శన చేసిన ఇద్దరి పేర్లు చెప్పాలని బిగ్ బాస్ చెప్పగా, ఎవరూ పేర్లు చెప్పడానికి ముందుకు రాకపోయేసరికి వరుణ్ సందేశ్, తమన్నా సింహాద్రి వారికీ వారే చెత్త ప్రదర్శన చేసినట్టు బిగ్ బాస్ కి చెప్పడంతో వారిద్దరికీ తదుపరి ఆదేశం వచ్చే వరకు జైలు శిక్ష విధించారు.
- నాకు ఏసీ లేకపోతే నిద్రపట్టదు అని తమన్నా సింహాద్రి ఏడ్చేసింది
- జైలులో ఉన్న తమన్నా సింహాద్రితో శ్రీముఖి చాలాసేపు ముచ్చటించింది
- ఈ ఎపిసోడ్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ లు, జైలు శిక్షతో ఆసక్తికరంగా సాగింది.