గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. నటి హేమ, జర్నలిస్టు జాఫర్, వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అవ్వగా ఇంటిలో 13 మంది సభ్యులున్నారు. ఆగస్టు 13న ప్రసారమైన బిగ్ బాస్-3 ఇరవైనాల్గువ ఎపిసోడ్ లో ముందుగా ఎగ్స్ సొంతం చేసుకోమని కోరి, తరువాత నేనే రాజు-నేనే మంత్రి కెప్టెన్సీ టాస్క్ లో విక్రమపురి, సింహపురి రాజ్యాలుగా టీం మెంబర్స్ ని విడగొట్టి రెడ్,బ్లూ జెండాలు ఇచ్చి ఎక్కువ జెండాలు ఎవరి దగ్గర ఉంటే వారే విజేత అని బిగ్ బాస్ ప్రకటించాడు. ఎపిసోడ్ అంతా ఇంటి సభ్యులు టాస్క్ లో లీనమై ఫీట్లు చేసారు.
ఎపిసోడ్ 23( ఆగస్టు 12) హైలైట్స్: నేనే రాజు-నేనే మంత్రి కెప్టెన్సీ టాస్క్ , ఇంటి సభ్యుల యాక్షన్ ఫీట్లు
- ఉదయమే ఇంట్లో టాస్క్ కోసం వేసిన సెట్ చూసి సభ్యులు చర్చ మొదలు పెట్టారు
- శ్రీముఖి, మహేష్ విట్టా మరియు హిమజ, పునర్నవి గురించి మాట్లాడుకున్నారు
- బిగ్ బాస్ ముందుగా ఎగ్స్ సొంతం చేసుకోమని చెప్పగా శివజ్యోతి, రోహిణి, వితికా తలొక ఎగ్ తీసుకున్నారు
- బిగ్ బాస్ సభ్యులను రెడ్ టీం, బ్లూ టీం ఉంటాయని చెప్పి, రెడ్ టీం సేనాపతిగా శ్రీముఖి, బ్లూ టీం సేనాపతిగా హిమజను ప్రకటించారు.
- హిమజ బ్లూ టీంలో వరుణ్ సందేశ్, రవికృష్ణ, బాబాబాస్కర్, పునర్నవి ఉన్నారు
- శ్రీముఖి రెడ్ టీంలో అలీరేజా,రాహుల్, మహేష్, అషు రెడ్డి ఉన్నారు
- నేనే రాజు-నేనే మంత్రి కెప్టెన్సీ టాస్క్ లో విక్రమపురి రాజ్యానికి రెడ్ జెండాలను, సింహపురి రాజ్యానికి బ్లూ జెండాలను కేటాయించారు
- ఎగ్స్ సొంతం చేసుకున్న వాళ్ళని డ్రాగన్స్ గా ప్రకటించారు, ఎగ్స్ కోల్పోతే టాస్క్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది
- జెండాల కోసం, ఎగ్స్ కోసం రెండు టీమ్స్ సభ్యులు పోటీ పడి ఆడారు
- శివజ్యోతి నుంచి ఎగ్ హిమజ తీసుకోగా, హిమజ నుంచి వరుణ్ సందేశ్ తీసుకుని డ్రాగన్ గా మారారు
- వరుణ్ సందేశ్ నుంచి ఎగ్ ను తెలివిగా మహేష్ విట్టా తీసుకున్నాడు
- ఒకరిదగ్గర ఎగ్ మరొకరు తీసుకుంటూ పోటీ పడ్డారు
- చివరికి రాహుల్, అలీ, రవికృష్ణ ఎగ్స్ దక్కించుకున్నారు, కెప్టెన్సీ టాస్క్ లో సెకండ్ లెవెల్ కి వెళ్లారు
- ఈ రోజు ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ లో సెకండ్ లెవెల్ జరగనుంది.