సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi Makes Grand Entry Into Social Media on the Day Of Ugadi Festival,Mango News,Mango News Telugu,Megastar Chiranjeevi,Megastar Chiranjeevi Latest News,Megastar Chiranjeevi Entry Into Social Media Platforms,Megastar Chiranjeevi Grand Entry Into Social Media

ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి మార్చ్ 25న ఉగాది పండుగ సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. బుధవారం ఉదయం 11:11 నిమిషాలకు @KChiruTweets అనే అకౌంట్ తో ట్విట్టర్ లో అడుగుపెట్టారు. ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రజలుకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటి ట్వీట్ చేశారు. రెండవ ట్వీట్ లో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌ ను తప్పనిసరిగా పాటించాలంటూ ప్రజలకు సూచించారు. మంగళవారం రోజు సోషల్ మీడియాలోకి రావాలనుకోవడానికి గల కారణాలను చిరంజీవి వీడియో ద్వారా వివరించారు. ” ఇక నుంచి నేను కూడా సోషల్‌మీడియాలోకి రావాలి అనుకుంటున్నాను. దానికి కారణం ఎప్పటికప్పుడు నా భావాల్ని నా అభిమానులతో పంచుకోవడానికి, అలాగే నేను చెప్పాలి అనుకుంటున్న సందేశాలు, ఇతర విషయాలు ప్రజలతో చెప్పడానికి ఇది వేదికగా భావిస్తున్నా… ఈ ఉగాది రోజు నుంచి సోషల్ మీడియాలోకి వస్తున్నానని’ చిరంజీవి తెలిపారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =