గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు.ఆగస్టు 10, 11న ప్రసారమైన బిగ్ బాస్ 3 ఇరవై ఒకటి, ఇరవై రెండవ ఎపిసోడ్స్ లో ఇంటి సభ్యులలో కొంతమందికి నాగార్జున వార్నింగ్ ఇచ్చారు, ఇంటిలో జరుగుతున్న గొడవలపై స్పందించారు. అయితే ఆదివారం నాడు కమెడియన్ వెన్నెల కిషోర్ తో కలిసి అలరించారు,ఈ ఎపిసోడ్ లో తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అవుతున్నట్టు ప్రకటించారు. జాఫర్, తమన్నా సింహాద్రి ఎలిమినేషన్ తో ఇంటిలో 13 మంది సభ్యులున్నారు.
ఎపిసోడ్ 21 (ఆగస్టు 10), ఎపిసోడ్ 22 (ఆగస్టు 11) హైలైట్స్: తమన్నా సింహాద్రి ఎలిమినేషన్
శనివారం(ఆగస్టు 10) ఎపిసోడ్:
- ఖైదీ నెంబర్ 150 సినిమాలోని అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ తో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు
- తెలుగు సినిమాలకి 7 నేషనల్ అవార్డ్స్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, వారికీ శుభాకాంక్షలు తెలియజేసారు.
- మన టీవీ ద్వారా ఇంటి సభ్యులు చేసే పనులు చూపించారు
- రాహుల్, వితికా శ్రీముఖి గురించి మాట్లాడుకున్నారు
- హిమజ విషయంలో అలీరేజా స్పందించిన తీరుని నాగార్జున తప్పు పట్టాడు, 21 గుంజీలు తీయించాడు
- హిమజను సపోర్ట్ చేసినందుకు తమన్నా సింహాద్రిని అభినందించారు
- అయితే రవి విషయంలో తమన్నా సింహాద్రిని ప్రశ్నించారు, ఇంటి సభ్యులందరూ తమన్నాను తప్పు పట్టారు
- జర్నలిజం ఒక యాక్టింగ్ అంటూ, తమన్నా చేసిన కామెంట్స్ పట్ల నాగార్జున సీరియస్ అవ్వడంతో ఆమె జర్నలిస్టులకు సారీ చెప్పింది
- నిధి కోసం అద్దాలు చేతితో పగలగొట్టడం ఏంటని రవిని అడిగారు, రవి శ్రీముఖి జరిగిన విషయంపట్ల క్షమాపణ చెప్పారు
- రవి విషయంలో వితికా రియాక్ట్ అయినా తీరు వీడియోలో చూపించారు, వితికా ఎందుకు ఏడ్చిందో చెప్పింది
- రాహుల్ శ్రీముఖిని ఫాల్తు అన్నాడని సీరియస్ అయిన నాగార్జున, శ్రీముఖికి సారీ చెప్పించారు
- తరువాత ఇంటి సభ్యులతో నాగార్జున టాస్క్ చేయించారు
- పునర్నవి, రాహుల్, బాబా భాస్కర్, వితికా షెరు, తమన్నాల లగేజీ స్టోర్ రూములో పెట్టించి, ఎవరు లగేజీ లేకపోతే వారు ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించారు, అషు రెడ్డిని వెళ్లి చెక్ చేయమనగా అక్కడ ఒక్కరి లగేజీ కూడ లేకపోవడంతో అంతా షాక్ అయ్యారు. సస్పెన్స్ తరువాత ఎలిమినేషన్ ఆదివారం అని నాగార్జున ప్రకటించారు
ఆదివారం(ఆగస్టు 11) ఎపిసోడ్:
- అదుర్స్ సాంగ్ తో నాగార్జున ఎంట్రీ
- వచ్చిన వెంటనే మన టీవీ ద్వారా ఇంటి సభ్యులును నాగార్జున పలకరించారు
- ‘అంకితం నీకే అంకితం’ అనే గేమ్ ఆడించారు
- ఒక పేపర్ పై ఉన్న పాటను చూసి ఎవరికీ చెప్పకుండా, ఇంటి సభ్యులలో ఎవరికీ అంకితం ఇస్తున్నారో చెప్పి, ఆ పాటకి డాన్స్ చేయాలి
- శ్రీముఖి సై సినిమాలో సాంగ్ ని రాహుల్ కి అంకితం చేసింది
- రోహిణి, హిమజ వారి పాటలను బాబా భాస్కర్ కి అంకితం చేసి డాన్స్ తో అలరించారు
- బాబా భాస్కర్ ఒక్క మగాడు సాంగ్ తమన్నా సింహాద్రికి అంకితం ఇచ్చాడు
- తమన్నా సింహాద్రి మగాళ్లు వట్టి మాయగాళ్లు సాంగ్ రవికృష్ణ కి అంకితం ఇచ్చింది
- వరుణ్ సందేశ్ కన్నుల్లో నీ రూపమే సాంగ్ వితికాకి అంకితం ఇచ్చాడు
- అషు రెడ్డిని స్టోర్ రూమ్ లో ఉన్న సూట్ కేసును తీసుకురమ్మని మొదటగా సేఫ్ జోన్ లో ఉన్న సభ్యుని పేరు చెప్పించారు. ఈ వారం మొదటగా సేఫ్ జోన్లో ఉన్నది రాహుల్ అని అషు రెడ్డి ప్రకటించారు
- తరువాత పునర్నవిని సేఫ్ జోన్లో ఉన్నట్టు ప్రకటించారు.
- కమెడియన్ వెన్నెల కిషోర్ తో కలిసి నాగార్జున ఇంటిసభ్యులతో మాట్లాడారు
- వెన్నెల కిషోర్ ఇంటిలో ఉన్న అందరి గురించి తనదైన శైలిలో చెప్పాడు, అందరిని నవ్విస్తూ ఆకట్టుకున్నాడు
- బాబా భాస్కర్ సేఫ్ జోన్లో ఉన్నట్టు వెన్నెల కిషోర్ ప్రకటిస్తాడు
- చివరికి మిగిలిన వితికా, తమన్నా సింహాద్రి లలో తక్కువ ఓట్లు వచ్చిన తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు
- స్టేజి పైకి వచ్చిన తమన్నా సింహాద్రి ఇంటి సభ్యుల గురించి మాట్లాడింది
- బాబా భాస్కర్ కి కూతురిగా పుట్టుంటే సూపర్ లేడీ అయ్యేదాన్ని అని కన్నీరు పెట్టుకున్నారు. కొంతమంది సభ్యుల గురించి తమన్నా ఘాటుగానే స్పందించారు