చూడగానే.. “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అనేలా ఉండే జంటలు సినిమా పరిశ్రమలో కొన్ని ఉన్నాయి. వారిద్దరూ కలిసి ఎప్పుడు బయటకు వచ్చినా అభిమానులకు సందడే. తమ అభిమాన తారలకు మంచి జరగాలని కొందరు అభిమానులు పూజలు కూడా చేస్తుంటారు. అయితే, ఒక్కోసారో అనుకోని పరిస్థితుల్లో.. అలా కలిసిమెలిసి ఉన్న జంటలు హఠాత్తుగా విడిపోతున్నాయి. అభిమానులను షాక్ కి గురిచేస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్లు ఎంత త్వరగా జరుగున్నాయో.. విడిపోవడం కూడా అంతే త్వరగా జరిగిపోతున్నాయి. టాలీవుడ్లో ఇప్పటికే స్టార్ కపుల్ సమంత, నాగచైతన్య విడిపోయిన సంగతి తెలిసిందే.
తాజాగా, కోలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు తీసుకున్నారు. తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరూ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ వార్త విన్న రజనీకాంత్, ధనుష్ అభిమానులు షాకయ్యారు. ఎంతో అనోన్యంగా కలిసి ఉండే ధనుష్-ఐశ్వర్యలు విడాకులు తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ధనుష్, ఐశ్వర్యలది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. 2004లో ఇరుకుటుంబాల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ