తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిబ్రవరి 4వ తేదీన జూబ్లీహిల్స్ లోని సినీనటుడు చిరంజీవి నివాసంలో నటులు చిరంజీవి, నాగార్జున లతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి పలు అంశాలను చర్చించిన అనంతరం ఫిబ్రవరి రెండో వారంలో సినీ ప్రముఖులు, సంబందిత అధికారులతో మరోసారి సమావేశమై ఇంకా అనేక సమస్యలపై కూలంకషంగా చర్చించాలని నిర్ణయించారు. అందులో భాగంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినిమా కళాకారుల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించడం, పలు ఇతర అంశాలపై చర్చించడానికి ఫిబ్రవరి 10, సోమవారం నాడు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధ్యక్షతన మరొక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఈ సమావేశానికి సినీ నటులు చిరంజీవి, నాగార్జునలతో పాటుగా పలువురు సినీ పరిశ్రమ వ్యక్తులు, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు.
[subscribe]