కరోనా వలన తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్ బుధవారం నాడు కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యపరిస్థితి విషమించంతో బుధవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. గబ్బర్ సింగ్, మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందారు, అమితుమీ, రామయ్యా వస్తావయ్యా వంటి ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. కోసూరి వేణుగోపాల్ మృతి పట్ల తెలుగు పరిశ్రమ ప్రముఖులు, దర్శకులు, తోటి నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu