రాష్ట్ర ప్రభుత్వం ఇక నుండి విడుదల చేసే అన్ని జీవోలు, సర్క్యులర్లు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ప్రజలకు అందించే సమాచారం సౌలభ్యంగా ఉండేలా అధికారులు వ్యవహరించాలని సీఎం సూచించారు.
మరోవైపు మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేతర ఆస్తుల ఆన్ లైన్ నమోదు, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్దీకరణ తదితర అంశాలపై గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సీఎం కేసీఆర్ గురువారం నాడు ప్రగతిభవన్ లో సమావేశం నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu