జనసేన పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు ఈదర హరిబాబు, టీవీ రామారావు, కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్

Former MLAs Edara Haribabu TV Rama Rao Joined in Janasena Party in the Presence of Pawan Kalyan,Former MLAs Edara Haribabu,Former MLA TV Rama Rao,Former MLAs Joined in Janasena Party,MLAs in the Presence of Pawan Kalyan,Mango News,Mango News Telugu,Two ex-MLAs join Jana Sena,Former MLAs and YCP leaders joined,Pawankalyan,TV Ramarao,Janasenaparty,AP News,Janasena Party Latest News,Janasena Party News Updates,Janasena Party Leaders List,Former MLAs Joined,Pawan Kalyan Latest News and Updates

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇద్దరు మాజీ శాసన సభ్యులు జనసేన పార్టీలో చేరారు. ఆదివారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఒంగోలు మాజీ శాసన సభ్యుడు, ప్రకాశం జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబు, పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు మాజీ శాసనసభ్యుడు టి.వి.రామారావులు తమ అనుచరులతో కలసి పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. టీవీ రామారావు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి వచ్చారు.

పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఈ ఇరువురికి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వీరితోపాటు భీమిలి నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేతలు చందర్రావు, అక్కరమాని దివాకర్ లు కూడా జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, భీమిలి ఇంఛార్జ్ పంచకర్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =