టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇంట విషాదం చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ నేడు కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా శ్యామ్ సిద్ధార్థ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ క్రమంలో హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం శ్యామ్ సిద్ధార్థ తుదిశ్వాస విడిచారు. దీంతో నిఖిల్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గతంలో ఒకసారి సోషల్ మీడియా వేదికగా నిఖిల్ అభిమానులకు తన తండ్రి జన్మదినం సందర్భంగా ఒక ఫోటోను షేర్ చేస్తూ విషెస్ తెలిపారు. కాగా ఈ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో హీరో నిఖిల్ కు అభిమానులు, సన్నిహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్ తన కెరీర్ లో సూపర్ హిట్ ఐన ‘కార్తికేయ’ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారు. యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2’ సినిమా చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ