దక్షిణాది సీనియర్ నటి శోభనకు ఒమిక్రాన్ సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె స్వయంగా వెల్లడించారు. వాక్సిన్స్ వేయించుకున్నానని.. జాగ్రత్తగా ఉంటున్నానని.. అయినాగానీ, దీని బారిన పడ్డానని తెలిపారు. ప్రస్తుతం కీళ్ల నొప్పులు, చలి జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు శోభన తెలియజేసారు. మొదటి రోజు ఈ లక్షణాలతో బాధపడినప్పటికీ నెమ్మదిగా ఇవి తగ్గుతున్నాయి అని ఆమె అన్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నాసరే, తనకు కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ సోకింది అని చెప్పారు. వాక్సిన్స్ రెండు డోసులూ తీసుకున్నానని.. త్వరలోనే కోలుకుంటానని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు శోభన.
ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని శోభన సూచించారు. ఇప్పటికీ ఎవరైనా వాక్సిన్ వేయించుకోకపోతే త్వరగా వేయించుకోవాలని ఆమె కోరారు. ఈ కరోనా మహమ్మారి త్వరలోనే అంతమవ్వాలని ప్రార్థిస్తున్నట్లు శోభన తెలిపారు. తమిళనాడుకి చెందిన శోభన పలు దక్షిణాది రాష్ట్రాల్లో నటించారు. 90వ దశకంలో శోభన ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు. 51 సంవత్సరాల శోభన తెలుగు, తమిళ్, కన్నడ సహా అనేక భాషల్లో నటించారు. కాగా, శోభన ఒమిక్రాన్ బారినపడ్డారని తెలిసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ