దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 1,79,723 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,57,07,727 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 146 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,83,936 కి పెరిగింది. ప్రస్తుతం 7,23,619 (2.03%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక గత 24 గంటల్లో మహారాష్ట్ర (44388), వెస్ట్ బెంగాల్ (24287), ఢిల్లీ (22751), తమిళనాడు (12895), కర్ణాటక (12000), ఉత్తర్ ప్రదేశ్ (7680), గుజరాత్ (6275), కేరళ (6238), రాజస్థాన్ (5660), హర్యానా (5166) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో మరో 46,569 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 3,45,00,172 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 96.62 శాతంగానూ, మరణాల రేటు 1.36 శాతంగా ఉంది.
మరోవైపు దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4033కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం వెల్లడించింది. మొత్తం 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, అత్యధికంగా మహారాష్ట్రలో 1216, రాజస్థాన్ లో 529, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441, కేరళలో 333, గుజరాత్ లో 236, తమిళనాడులో 185, తెలంగాణలో 123, హర్యానాలో 123, ఉత్తర్ ప్రదేశ్ లో 113 కేసులు నమోదయ్యాయి. కాగా మొత్తం 4033 బాధితుల్లో ఇప్పటికే 1552 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ