దేశంలో ఇటీవల రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో దేశంలో ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కరోనా కేసుల సంఖ్య 91 వేలు (91,779 (0.21%)) దాటింది. గత 24 గంటల్లో 15,940 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,33,78,234 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 20 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,974 కి పెరిగింది. ముఖ్యంగా గత 24 గంటల్లో మహారాష్ట్ర (4205), కేరళ (3981), ఢిల్లీ (1447), తమిళనాడు (1359), కర్ణాటక (816), పశ్చిమబెంగాల్ (657), హర్యానా (651), ఉత్తర్ ప్రదేశ్ (620), తెలంగాణ (493), గుజరాత్ (380) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి.
ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.58 శాతంగానూ, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. కొత్తగా 12,425 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,27,61,481 కు చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద జూన్ 25, శనివారం ఉదయం 7 గంటల వరకు 196.94 కోట్లకుపైగా (1,96,94,40,932) కరోనా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని తెలిపారు. ముందు రోజున 15,73,341 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY