రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ బీజేపీ శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనిలో పాల్గొనడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూలై 1న హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో నడ్డాకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి సమావేశాలు జరిగే నోవాటెల్ హోటల్ వరకు ఘన స్వాగతం పలకేందుకు దాదాపు 50 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్యవర్గ సమావేశాల సన్నాహక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 30, జూలై 1,2 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ కార్యవర్గ సభ్యులు హైదరాబాద్లో విడిది చేయనున్నారు. ఆరోజు సాయంత్రం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల భేటీ జరుగనుంది. దీనిలో కార్యవర్గ సమావేశాల ఎజెండా, చేయాల్సిన తీర్మానాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక 2వ తేదీ ఉదయం పదాధికారుల సమావేశం జరుగనుంది. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 5 దాకా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉంటాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ 2వ తేదీన మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 3న సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని బహిరంగసభ ఉంటుంది. ఆయనతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY