ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసులు సంఖ్య 25 వేలు దాటింది. మరో 1608 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో, జూలై 10, శుక్రవారం ఉదయానికి కేసుల సంఖ్య 25422 కి చేరింది. మొత్తం కేసుల్లో 22647 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 2775 మంది ఉన్నారు. అలాగే కరోనా మరణాల సంఖ్య 292 కి చేరింది. ఇక రాష్ట్రంలో 13194 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 9635 మంది ఆసుపత్రుల్లో, 2301 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 11936 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- అనంతపూర్ – 2850
- చిత్తూరు – 2209
- కర్నూల్ – 2939
- కడప – 1645
- తూర్పుగోదావరి – 2231
- పశ్చిమ గోదావరి – 1527
- నెల్లూరు – 955
- ప్రకాశం – 975
- గుంటూరు – 2799
- కృష్ణా – 2175
- శ్రీకాకుళం – 646
- విజయనగరం – 419
- విశాఖపట్నం – 1277
- ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 2351
- విదేశాల నుంచి వచ్చిన వారు: 424
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu