దేశంలో గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 185 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 22, గురువారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,76,515 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరోక మరణం (ఢిల్లీలో 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,681కి పెరిగింది. ఇక దేశంలో గత 24 గంటల్లో 1,17,538 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.16 శాతంగా నమోదైంది.
అలాగే మరో 190 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,42,432 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 3,402 (0.01%) మంది చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసుల నమోదు కొంత ఎక్కువుగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE