దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, పలువురు ప్రజాపతినిధులు వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “తేలికపాటి లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. లక్షణాలు ప్రారంభమైనప్పటి నుండి సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నాను మరియు నాతో సన్నిహితంగా ఉన్న వారందరూ పరీక్షించబడ్డారు. యథాతథంగా విధులు నిర్వహించడంతో పాటుగా
నా నివాసం నుండే ఢిల్లీలోని పరిస్థితిని పర్యవేక్షిస్తాను” అని అనిల్ బైజల్ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ