దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల తర్వాత ఢిల్లీలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఇప్పటికే 15,257 కరోనా కేసులు నమోదవగా, 7264 మంది కోలుకున్నారు, 303 మంది మరణించారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో వైద్య సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఎయిమ్స్లో ఇప్పటివరకు మొత్తం 195 సిబ్బంది వైరస్ బారిన పడ్డట్టుగా తెలుస్తుంది. గత రెండు రోజులలోనే దాదాపు 50 మంది సిబ్బందికి కరోనా సోకినట్టు పేర్కొన్నారు. కరోనా సోకిన 195 మందిలో రెసిడెంట్ వైద్యులు, నర్సులు, ఎంబీబీఎస్ విద్యార్థులు, బోధనా సిబ్బంది, మెస్ వర్కర్లు, లేబోరేటరీ టెక్నీషియన్లు, సాంకేతిక సహాయకులు, శానిటేషన్ వర్కర్లు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వీరిలో కొంతమంది వైరస్ నుంచి కోలుకొని మళ్లీ విధులకు హాజరవుతుండగా, మిగిలిన వారు చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu