కరోనా నేపథ్యంలో హోమ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన గవర్నర్

Coronavirus in Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu Corona Positive Cases, Tamil Nadu Coronavirus, Tamil Nadu Governor, Tamil Nadu Governor Banwarilal Purohit, Tamil Nadu Governor Banwarilal Purohit went to Self Isolation, Tamil Nadu Governor went to Self Isolation

దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఇటీవలే తమిళనాడు రాజ్ భవన్ లో 84 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ముగ్గురికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. డాక్టర్ల సూచన మేరకు 7 రోజుల పాటు గవర్నర్ స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్టు రాజ్‌భవన్‌ అధికారులు ప్రకటించారు. ముందు జాగ్రత్తలో భాగంగానే స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నారని, ప్రస్తుతం గవర్నర్‌ ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. మరోవైపు జూలై 28 నాటికీ తమిళనాడు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,27,688 కి చేరుకుంది. వీరిలో 1,66,956 మంది కరోనా నుంచి కోలుకోగా, 57,073 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే కరోనా వలన ఇప్పటివరకు 3659 మంది మృతి చెందారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − eight =