మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇప్పటికీ 20003 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకిందని ఆ రాష్ట్ర పోలీస్ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఇందులో 16071 మంది పూర్తిగా కోలుకున్నారని, 204 మంది పోలీసులు మరణించారని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో 1696 మంది అధికారులు, 14375 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. అలాగే ఈ వైరస్ వలన మరణించిన వారిలో 20 మంది అధికారులు, 184 మంది సిబ్బంది ఉన్నారు. 447 మంది పోలీసు అధికారులు, 3281 మంది పోలీస్ సిబ్బందితో కలిపి మొత్తం 3728 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు పోలీస్ శాఖ వెల్లడించింది. ఇక మహారాష్ట్ర రాష్ట్రంలో సెప్టెంబర్ 15, మంగళవారం నాటికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,97,856 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 30,409 కి పెరిగింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu