టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఎం.సుదర్శన్ రావు గుండెపోటుతో మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఉద్యమ తొలినాళ్లలో అద్భుతంగా పని చేసిన నాయకుడని సీఎం కేసీఆర్ కొనియాడారు. చిన్న వయస్సులో చనిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం గచ్చిబౌలి ఏఐజి హాస్పిటల్ లో సుదర్శన్ రావు గుండెపోటుతో మరణించారు. ఆయన గత కొన్ని రోజులుగా కరోనా బారిన పడి ఆ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎం.సుదర్శన్ రావు పోటీ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu