దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసులు 50 వేల దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 25,920 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,27,80,235 కు చేరుకుంది. అలాగే కరోనాతో కొత్తగా 492 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,10,905 కు పెరిగింది. తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువగా కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మిజోరాం, ఒడిశా, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి.
ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,92,092 (0.68%) మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. కొత్తగా మరో 66,254 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,19,77,238 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.12 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఫిబ్రవరి 18, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 75,68,51,787
- ఫిబ్రవరి 17న నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 12,54,893
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,27,80,235
- కొత్తగా నమోదైన కేసులు [ ఫిబ్రవరి 17–ఫిబ్రవరి 18(8AM-8AM)] : 25,920
- నమోదైన మరణాలు : 492
- రికవరీ అయిన వారి సంఖ్య : 4,19,77,238
- యాక్టీవ్ కేసులు : 2,92,092
- మొత్తం మరణాల సంఖ్య : 5,10,905
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ